పాకిస్థాన్ కు ప్రధాని మోదీ వార్నింగ్

పాకిస్థాన్ కు ప్రధాని మోదీ వార్నింగ్
x
Highlights

పుల్వామా దాడి వెనుక హస్తం ఉన్న వారిని ఖచ్చితంగా శిక్షించి తీరుతామని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పాకిస్థాన్ ను ఉద్దేశించి హెచ్చరించారు. శనివారంనాడు...

పుల్వామా దాడి వెనుక హస్తం ఉన్న వారిని ఖచ్చితంగా శిక్షించి తీరుతామని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పాకిస్థాన్ ను ఉద్దేశించి హెచ్చరించారు. శనివారంనాడు మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. పుల్వామా ఘాతుకానికి పాల్పడిన వారు ఎక్కడా దాక్కోలేరని, ఎంతమందున్నా, ఎక్కడ దాక్కున్నా ఖాతరు చేసేది లేదని, దేశ ప్రజలు ఓర్పు, నమ్మకంతో ఉండాలని కోరారు. కాగా అమరవీరుల త్యాగాలను వృథా కానీయమని, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని మోడీ చెప్పారు. ఏ పద్ధతిలో ఉగ్రవాదులను శిక్షిస్తాం అనేది భద్రతా బలగాలు నిర్ణయిస్తాయని. ఈ విషయంలో భారత బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని అన్నారాయన. ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న వారిని ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టేది లేదని పరోక్షంగా పాక్ కు వార్నింగ్ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories