మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ రేంజర్లు

మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ రేంజర్లు
x
Highlights

♦ కుప్వారా సెక్టార్‌లో ఉదయం నుంచి కాల్పులకు తెగబడ్డ పాక్ సైన్యం ♦ పాక్‌ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం ♦ ఎదురుకాల్పులకు దిగిన భారత సైన్యం ♦ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న భారత జవాన్లు ♦ సరిహద్దుల్లో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత

పుల్వామా, బాలాకోట్ ఘటన మరువకముందే పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ తెల్లవారుజాము నుంచి పాకిస్తాన్‌ సైనికులు భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు.

కుప్వారా సెక్టార్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు తమ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎదరుకాల్పులకు దిగిన భారత సైన్యం సరిహద్దు వెంబడి పాక్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా కాల్పులకు దిగింది. ఈ ఘటనతో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సైన్యం పూర్తి అలర్ట్‌గా ఉందని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories