బీజేపీలో చేరిన మాజీ ఎంపీ జయప్రద

బీజేపీలో చేరిన మాజీ ఎంపీ జయప్రద
x
Highlights

మాజీ ఎంపీ, సినీనటి జయప్రద బీజేపీలో చేరారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న జయప్రద వైఎ్‌సఆర్‌సీపీ లేదా టీడీపీ లో చేరతారని భావించారు. అయితే...

మాజీ ఎంపీ, సినీనటి జయప్రద బీజేపీలో చేరారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న జయప్రద వైఎ్‌సఆర్‌సీపీ లేదా టీడీపీ లో చేరతారని భావించారు. అయితే అనూహ్యంగా ఆమె సోమవారం బీజేపీ కండువా కప్పుకున్నారు. అమర్‌సింగ్‌ సన్నిహితురాలిగా సమాజ్‌వాదీ పార్టీలో ఓ వెలుగు వెలిగిన జయప్రద.. కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

యూపీలోని రామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు ఆమె. కాగా గతంలో ఆమెపై సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఆ తరువాత అమర్‌సింగ్‌తో కలిసి రాష్ట్రీయ లోక్‌మంచ్‌ పేరుతో పార్టీ స్థాపించారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో అమర్‌సింగ్‌తో కలిసి ఆర్‌ఎల్డీలో చేరారు. జయప్రద బీజేపీలో చేరారు. ఆమె రామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories