సుష్మా స్వరాజ్‌ మృతి: కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి

సుష్మా స్వరాజ్‌ మృతి: కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి
x
Highlights

బీజేపీ సీనియర్‌ నేత.. విదేశాంగ శాఖ మాజీ మంత్రి.. సుష్మా స్వరాజ్‌ (67) గత రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుష్మా...

బీజేపీ సీనియర్‌ నేత.. విదేశాంగ శాఖ మాజీ మంత్రి.. సుష్మా స్వరాజ్‌ (67) గత రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుష్మా స్వరాజ్‌ భౌతిక కాయాన్ని చూసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కంటతడిపెట్టారు. సుష్మాస్వరాజ్‌ ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేపోతున్నట్లు ఉద్వేగానికి లోనయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌‌రెడ్డి. సుష్మా తనకే కాదు యావత్ తెలంగాణకే చిన్నమ్మ అంటూ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మా పాత్ర మరువలేనిదంటూ కొనియాడారు. ప్రజా సమస్యలపై ఆమె స్పందించే తీరు తమలాంటి వారికి స్ఫూర్తి అన్నారు. ఆమె జీవితాన్ని భారత ప్రజలకు అంకితం ఇచ్చారు. సుష్మాస్వరాజ్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని తెలిపారు. ఇటు సుష్మాస్వరాజ్‌ హఠాన్మరణంపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. దేశానికి సుష్మా చేసిన సేవలను కొనియాడుతూ‌.... ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories