కుప్పకూలిన భవనం.. ఏడుగురు దుర్మరణం

కుప్పకూలిన భవనం.. ఏడుగురు దుర్మరణం
x
Highlights

దేశ రాజధానిలో ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. మూడంతస్థుల ఫ్యాక్టరీ భవనం గురువారం కుప్పకూలింది. దాంతో ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో 8 మంది...

దేశ రాజధానిలో ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. మూడంతస్థుల ఫ్యాక్టరీ భవనం గురువారం కుప్పకూలింది. దాంతో ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మోతీనగర్‌లోని సుదర్శన్‌ పార్క్‌ వద్ద జరిగింది. ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేస్తుండగా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆ భవనంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో భవనం కుప్పకూలింది. శిధిలాల కింద చిక్కుకుని పలువురు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగి శిధిలాల కింద చిక్కుకున్న మరో 8 మందిని రక్షించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories