ఈ నెల 8న బ్యాంకుల బంద్..

ఈ నెల 8న బ్యాంకుల బంద్..
x
Highlights

నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏదో ఒక ప్రభుత్వ శాఖ వారు వారి సమస్యలను పరిష్కరించాలని సమ్మెలు, బంద్ లు నిర్వహించారు.

నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏదో ఒక ప్రభుత్వ శాఖ వారు వారి సమస్యలను పరిష్కరించాలని సమ్మెలు, బంద్ లు నిర్వహించారు. ఇప్పుడు అదే కోణంలో మరో డిపార్ట్ మెంట్ వారు బంద్ లు చేపట్టాడానికి నిర్ణయం తీసుకుంటున్నాయి. పూర్తి వివరాల్లోకెళితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను బ్యాంకు యూనియన్లు వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వహిస్తున్న విధి విధానాలకు వ్యతిరేకంగా బ్యాంక్‌‌లు బంద్ చేపట్టబోతున్నాయి. దీంతో ఈ సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా బ్యాంకులపై పడనున్నాయి.

కేంద్ర ట్రేడ్ యూనియన్లు చేపడుతోన్న ఆల్‌‌ ఇండియా జనరల్ స్ట్రయిక్‌‌లో పాల్గొనాలని బ్యాంక్ యూనియన్లు కూడా నిర్ణయించాయి. ఈ నెల 8న(బుధవారం) విధులకు రావొద్దని బ్యాంక్‌‌ యూనియన్లు ఉద్యోగులకు సూచించాయి. ఆ రోజున బ్యాంకుల్లోని అన్ని బ్రాంచ్‌‌ల్లో జరిగే సాధారణ బ్యాంకింగ్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. ఆన్‌లైన్‌ ‌బ్యాంకింగ్ సేవలు మాత్రం ఈ సమ్మెకు ప్రభావితం కావని బ్యాంకింగ్ సేవలు తెలిపాయి.

ఈ సమ్మె ప్రభావం ఏటీఎం సేవలపై కూడా చూపనున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. స్ట్రయిక్ రోజు ఎలాంటి క్లరికల్ వర్క్‌‌ను చేపట్టవద్దని తమ సభ్యులను ఆదేశించినట్టు ఆల్‌‌ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్(ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా చెప్పారు. ఎవరైనా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవాలన్నా, డబ్బు డ్రా చేసుకోవాలన్నా ఎవరైనా మంగళవారం రోజువరకే వారి పనులను పూర్తి చేసుకోవాలని బ్యాంకింగ్ వర్గాలు తెలుపుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories