యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం:29 మంది దుర్మరణం

యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం:29 మంది దుర్మరణం
x
Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కాలువలోకి పల్టీ కొట్టడంతో 29 మంది మరణించారు. ఈ తెల్లవారుజామున జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.. లక్నో...

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కాలువలోకి పల్టీ కొట్టడంతో 29 మంది మరణించారు. ఈ తెల్లవారుజామున జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.. లక్నో నుంచి ఢిల్లీకి బయల్దేరిన యూపీ రోడ్‌వేస్‌ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు రాగానే మురికి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది మృతి చెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు.

కాగా ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక యూపీ రవాణాశాఖ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories