వేణుమాధ‌వ్ మృతి షాక్‌కి గురి చేసింది : క్రికెటర్ యూసఫ్ ప‌ఠాన్

వేణుమాధ‌వ్ మృతి షాక్‌కి గురి చేసింది : క్రికెటర్ యూసఫ్ ప‌ఠాన్
x
Highlights

వేణుమాధ‌వ్ మృతి షాక్‌కి గురి చేసింది : క్రికెటర్ యూసఫ్ ప‌ఠాన్

టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్‌ అంత్యక్రియలు గురువారం ముగిసిన సంగతి తెలిసిందే. మౌలాలి హౌజింగ్‌ బోర్డ్‌ లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు వేణుమాధవ్‌ దహన సంస్కారాలు నిర్వహించారు. వేణుమాధవ్‌ పెద్ద కుమారుడు చితికి నిప్పంటించాడు. ఇక వేణుమాధవ్ మృతికి సంతాపం తెలిపారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ యూసఫ్ ప‌ఠాన్.. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. 'వేణు మాధ‌వ్ చ‌నిపోయార‌నే వార్త న‌న్ను షాక్‌కి గురి చేసింది. సిల్వ‌ర్ స్క్రీన్‌పై నేను చూసిన అద్భుత క‌మెడీయ‌న్స్‌లో ఆయ‌న ఒక‌రు. అత‌నిని ఎవ‌రు రీప్లేస్ చేయ‌లేరు. ఆయ‌నకి నా నివాళులు. కుటుంబ స‌భ్యులకి, మిత్రుల‌కి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను' అని ట్వీట్‌లో పేర్కొన్నారు కాగా ఒక‌ప్పుడు ఇండియ‌న్ టీంలో ఆల్‌రౌండర్‌గా రాణించిన యూస‌ఫ్ ప్రస్తుతం దూరంగా ఉన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories