వేలంలో 'యాత్ర' టికెట్‌ ధర ఎంత పలికిందో తెలుసా..?

వేలంలో యాత్ర టికెట్‌ ధర ఎంత పలికిందో తెలుసా..?
x
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ జీవితంలో భాగమైన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈనెల 8న విడుదల...

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ జీవితంలో భాగమైన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈనెల 8న విడుదల అవుతోంది. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి వైయస్ పాత్రలో నటించాడు. ఈ మధ్యే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్రయూనిట్‌ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అమెరికాలోని సీటెల్‌లో 'యాత్ర' ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ను వేలం వేశాయి. అందులో మునీశ్వర్‌ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్‌ను గెలుచుకున్నారు. అయితే $12 విలువ చేసే టికెట్‌ను అతనికి అందించి.. మిగతా డబ్బులను వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories