Manchu Vishnu: "ఢీ" సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చిన విష్ణు

Manchu Vishnu Gave Clarity on the Movie with Srinu Vaitla
x

Manchu Vishnu: "ఢీ" సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చిన విష్ణు

Highlights

Manchu Vishnu: శ్రీను వైట్లతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు

Manchu Vishnu: టాలీవుడ్ హీరో మంచు విష్ణు మరియు ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మొట్టమొదటి సినిమా ఢీ. 2017 లో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శ్రీను వైట్ల మరియు మంచు విష్ణు ల కెరీర్ లలో మైలురాయి చిత్రం గా మిగిలిపోయిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించగా శ్రీహరి ముఖ్య పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉందని "ఢీ అండ్ ఢీ: డబల్ డోస్" అనే టైటిల్ తో మంచు విష్ణు మరియు శ్రీను వైట్ల కాంబినేషన్లో మరొక సినిమాని ప్రకటించారు దర్శకనిర్మాతలు.

ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన విడుదల అయ్యి ఇప్పటికి చాలా నెలలు గడిచింది కానీ ఈమధ్య కాలంలో సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా విడుదల కాకపోవడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయింది అని వార్తలు వినిపించటం మొదలైంది. తాజాగా అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్న మంచు విష్ణు తన తదుపరి సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తాను ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆ సినిమా ఢీ సినిమా సీక్వెల్ కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఢీ సినిమాకి సీక్వెల్ అయిన ఢీ అండ్ ఢీ అటకెక్కిందని తెలుస్తోంది. మరోవైపు మంచు విష్ణు హీరోగా "జిన్నా" అనే సినిమా ఈనెల 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories