'దొరసాని' కి సెన్సార్ సభ్యుల ప్రశంసలు

దొరసాని కి సెన్సార్ సభ్యుల ప్రశంసలు
x
Highlights

ట్రైలర్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'దొరసాని' ఇపుడు సెన్సార్ సభ్యులను కూడా ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, హీరో రాజశేఖర్ కుమార్తె...

ట్రైలర్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'దొరసాని' ఇపుడు సెన్సార్ సభ్యులను కూడా ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న సినిమా 'దొరసాని'. ఈ సినిమా టైటిల్ వచ్చిన దగ్గరనుంచి అంచనాలు పెంచుకుంటూ వస్తోంది. టీజర్ లు , ట్రైలర్లు ఆ అంచనాల్ని మరింత పెంచేశాయి. ఇటీవాలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. సినిమా పై ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇపుడు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి యు బై ఏ సర్టిఫికెట్‌ అందుకున్నట్టు సినిమా యూనిట్ తెలిపింది. సెన్సార్ సభ్యులు సినిమాని మెచ్చుకున్నారని వారు చెప్పారు. ఇక ఈ అభినందనలు తమకు సినిమా విజయం పై మరింత నమ్మకాన్ని పెంచాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో శివాత్మిక, ఆనంద్ ల నటన కు ప్రేక్షకులు ఫిదా అయిపోవడం ఖాయమని ఆ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

మధుర ఎంటర్‌టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మించిన 'దొరసాని' తో కె.వి.ఆర్. దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం జూలై 12న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories