ఏపీలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' విడుదలకు బ్రేక్‌

ఏపీలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదలకు బ్రేక్‌
x
Highlights

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా విడుదలకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బ్రేకులు వేసింది. తదుపరి...

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా విడుదలకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బ్రేకులు వేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ సినిమాను విడుదల చేయరాదని దర్శక నిర్మాతలను హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాను ఏప్రిల్‌ 3న తాము స్వయంగా వీక్షిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్మాత రాకేష్‌రెడ్డికి హైకోర్టు సూచించింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావుతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ సినిమాను ఇవాళ విడుదల చెయ్యాలని అనుకుంది చిత్ర బృదం. అయితే హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories