జనవరి 9న ముగియనున్న వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

జనవరి 9న ముగియనున్న వైఎస్‌ జగన్‌ పాదయాత్ర
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈనెల 9తేదిన ముగియనుందని వైసీీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈనెల 9తేదిన ముగియనుందని వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గత సంవత్సరం 2017 నవంబర్ 6తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో జగన్ పాదయాత్ర ప్రారంభమై 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుందని సజ్జల రామకృష్ణరెడ్డి వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు 134 నియోజకవర్గాల్లో 120 బహిరంగ సభలు, 2వేలకు పైగా గ్రామాలు, 3500కిలో మీటర్లకుపైగా పాదయాత్ర సాగిందని ఆయన తెలిపారు. నేడు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories