వైఎస్‌ జగన్‌ సీఎం కావడంతో అభిమాని పాదయాత్ర

వైఎస్‌ జగన్‌ సీఎం కావడంతో అభిమాని పాదయాత్ర
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ సునామీ సృష్టించి, ఎవరూ ఊహించనివిధంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ, లోక్‌సభ...

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ సునామీ సృష్టించి, ఎవరూ ఊహించనివిధంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ, లోక్‌సభ రెండింటిలోనూ ఫ్యాన్ గాలి వీచింది. ఫ్యాన్ హోరుకి అధికార టీడీపీతోపాటు జనసేన, ఇతర పార్టీలు కొట్టుకుపోయాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవి పగ్గాలు చేపట్టారు. ఇదిలాఉంటే వైఎస్‌.జగన్‌ భారీ మెజార్టీతో విజయం సాధించడంతోపాటు ఏపీ సీఎం కావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు ఓ యువకుడు ఇడుపులపాయకు పాదయాత్రగా బయల్దేరాడు. వైఎస్‌.రాజశేఖరరెడ్డి అభిమాని అయిన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదళ మండలం నల్లవెళ్లి గ్రామానికి చెందిన శివలింగం గత నెల 29న ఇడుపులపాయకు పాదయాత్ర చేపట్టాడు. ఈపాదయాత్ర శనివారం రాత్రి వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుంది. ఈ సందర్భంగా శివలింగంమాట్లాడుతూ గత2004లో వైఎస్‌ఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినయ్యానని, అప్పటి నుంచి వైఎస్‌కు వీరాభిమానిగా మారనన్నారు. మొత్తానికి ఈనెల 9న ఇడుపులపాయకు చేరుకోనున్నట్టు ఆయన తెలిపారు.





Show Full Article
Print Article
Next Story
More Stories