డేటా చోరీపై గవర్నర్‌కు వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు

డేటా చోరీపై గవర్నర్‌కు వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు
x
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను కలిసారు. ఆంధ్రప్రదేశ్‌లో డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపుపై గవర్నర్‌...

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను కలిసారు. ఆంధ్రప్రదేశ్‌లో డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపుపై గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి జగన్‌ బుధవారం సాయంత్రం 4.45 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో సమావేశం అయ్యారు. డేటా చోరీ కేసు విచారణను వెంటనే వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మేరకు వినతిపత్రం గవర్నర్‌కు సమర్పించారు. గవర్నర్ సమావేశంలో జగన్ తో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కొలుసు పార్థసారధి, రాజన్న దొర తదితరులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories