వివాహ పత్రికలు పంచేందుకు వెళ్లి.. అనంతలోకాలకు..

వివాహ పత్రికలు పంచేందుకు వెళ్లి.. అనంతలోకాలకు..
x
Highlights

సరిగ్గా మరో రెండంటే రెండ్రోజుల్లో పెళ్లి పిటలు ఎక్కాల్సిన యువకుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పెండ్లి వారి ఇంట్లో విషాదఛాయలు...

సరిగ్గా మరో రెండంటే రెండ్రోజుల్లో పెళ్లి పిటలు ఎక్కాల్సిన యువకుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పెండ్లి వారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక వివరాల్లో్కి వెళితే వైఎస్ఆర్ జిల్లా నందలూరు (మం) నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లె తోటపాళెంకు కాశి యాసిరాజు అలియాస్‌ కాశి బాబు కుమారుడు కాశి శ్యాం (25)కు ఈనెల 12వ తేదీన అంటే ఎల్లుండే పెళ్లిపిటలు ఎక్కాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తన పెళ్లికి ఆహ్వానించేందుకు బంధువుల ఇంటికి వివాహ పత్రికలతో ఆదివారం ఉదయం ఇంటి నుండి పయనం అయ్యాడు. సరిగ్గా మధ్యాహ్నం 3:30 నిమిషాల సమయంలో నందలూరు ఆల్విన్‌ కర్మాగార సమీపంలో ముంబై నుంచి చెన్నై వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ రైలుకింద పడడంతో కాశిశ్యాం రెండు కాళ్లు తెగిపోయాయి.

వెంటనే కాశిశ్యాంను గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వగా రాజంపేట సర్కారు దవాఖానకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. మరో రెండ్రోజుల్లో ఇంట్లో పెళ్లి సందడితో కిటకిటలాడాల్సిన ఊరు కాశిశ్యాం మృతితో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తలిదండ్రుల, బంధుమిత్రు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories