కమల్‌హాసన్ పార్టీ ఎన్నికల గుర్తు ఇదే...

కమల్‌హాసన్ పార్టీ ఎన్నికల గుర్తు ఇదే...
x
Highlights

విలక్షణ నటుడు కమల్‌హాసన్ స్థాపించిన 'మక్కల్‌ నీది మయ్యం'(ఎంఎన్ఎం) పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తుగా ఎన్నికల సంఘం కేటాయించింది. కమల్ రాజకీయాల్లోకి...

విలక్షణ నటుడు కమల్‌హాసన్ స్థాపించిన 'మక్కల్‌ నీది మయ్యం'(ఎంఎన్ఎం) పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తుగా ఎన్నికల సంఘం కేటాయించింది. కమల్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన కమల్ 2018 ఫిబ్రవరి 21న మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపింపించిన విషయం తెలసిందే .మేలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ గుర్తుపైనే ఎంఎన్ఎస్ పోటీ చేస్తుంది. 39 లోక్‌సభ స్థానాల్లోనూ సొంతంగానే ఎన్నికల బరిలో దిగుతుందని కమల్ స్పష్టం చేశారు. అయితే ఇటివలే తమ పార్టీకి గుర్తు కావాలని కోరుతూ కమల్‌హాసన్ ఈసీని ఆశ్రయించిన విషయం తెలిసిందే కాగా ఈ మేరకు ఈసీ బ్యాటరీ టార్చ్ సింబల్ కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఎంఎన్ఎంకు కూడా తెలియచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories