సీఈసీకి విజయసాయిరెడ్డి లేఖ..

సీఈసీకి విజయసాయిరెడ్డి లేఖ..
x
Highlights

కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర...

కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రత పెంచాలని అన్ని స్ట్రాంగ్‌ రూముల దగ్గర 24 గంటల పాటు సీసీ టీవీ కెమెరాలతో నిఘా పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కేంద్ర ఎన్నికల సంఘానికి సహకరించడం లేదని రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర బలగాలనే కాపలాగా ఉంచాలని లేఖలో విజయసాయిరెడ్డి కోరారు.

ఎన్నిల సంఘంపై నారా చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడమే కాకుండా, ధర్నాలు కూడా చేసిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఈ విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించినందుకు వైసీపీ తరపున ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 11న ముగిసిన సంగతి తెలిసిందే. ఇక మే 23న ఓట్లను లెక్కించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories