చెదలు పట్టిన ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్లు..

చెదలు పట్టిన ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్లు..
x
Highlights

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు...

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. అయితే జయశంకర్ భూపాలపల్లి మహదేవ‌పుర మండలం అంబట్ పల్లిలో కౌంటింగ్ అగిపోయింది. అంబట్ పల్లి, సూరారం ఎంపీటీసీ పరిధిలో ఓట్లకు చెదలు పట్టాయి. దీంతో కౌంటింగ్ సిబ్బంది గందరగోళంలో పడిపోయింది. ప్రస్తుతం అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. బ్యాలెట్ పేపర్లకు చెదలు వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్‌కు వివరించిన అధికారులు. బ్యాలెట్ బాక్స్‌ను కౌంటింగ్ చేయకుండా ఆపిన అధికారులు. ఇక బ్యాలెట్ బాక్స్‌లో మొత్తం 395 ఓట్లు ఉన్నాయి. చివరిగా అధికారుల నిర్ణయం అంతటా తీవ్రఉత్కంఠ పరిస్థితి నెలకొంది. బ్యాలెట్ పేపర్లు పూర్తిగా పాడైన నేపథ్యంలో ఆ రెండు గ్రామాల్లో రీపోలింగ్ జరిపే అవకాశముంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories