బరిలో 185 మంది... నిజామాబాద్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా...

బరిలో 185 మంది... నిజామాబాద్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా...
x
Highlights

నిజామాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నికల నిర్వహణ వ్యయంలో, సదుపాయాలలోనూ ప్రత్యేకత చాటుకుంటోంది. మామూలుగా పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక్కో సెగ్మెంట్‌కు 3కోట్ల...

నిజామాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నికల నిర్వహణ వ్యయంలో, సదుపాయాలలోనూ ప్రత్యేకత చాటుకుంటోంది. మామూలుగా పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక్కో సెగ్మెంట్‌కు 3కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే, ఒక్క నిజామాబాద్‌లోనే 5కోట్లు దాటే అవకాశం ఉంది. ఇక్కడ ఎన్నికల వ్యయం 35కోట్ల రూపాయలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని మొత్తం 17వందల 88 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో వీవీ ప్యాట్, ఒక్కో కంట్రోలింగ్ యూనిట్‌తో పాటు 12 చొప్పున 25వేలకు పైగా ఈవీఎంలు వినియోగిస్తున్నారు. మరోవైపు పోలింగ్‌ సిబ్బంది సైతం, ఎక్కవ సంఖ్యలోనే విధులు నిర్వహించనున్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో మామూలుగా నలుగురు సిబ్బందిని నియమిస్తారు. ఇక్కడ మాత్రం మరో ఇద్దరిని అదనంగా కేటాయించారు. ఇలా నిజామాబాద్ లోక్ సభ స్థానం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కలిసి సిబ్బంది సంఖ్య 9వేలు దాటింది. వీరితో పాటు నోడల్ అధికారులు, మండల స్థాయి పరిశీలకులు, ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించారు.

ఈవీఎంల పరిశీలనకు హైదరాబాద్, బెంగళూరు నుంచి 150 మంది ఇంజనీర్లు నిజామాబాద్ వచ్చారు. ఇక పోలింగ్ రోజున సుమారు 400 మంది ఇంజనీర్లు తమ సేవలను అందించనున్నారు. బరిలో ఉన్న 185 మంది అభ్యర్థుల వివరాలతో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే మార్చడానికి హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచనున్నారు. మరోవైపు, ఇక్కడి పోలింగ్‌ వేళలను కూడా సవరించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలలోగా క్యూలో నిల్చున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories