కివీస్ తో వన్డే సిరీస్ లో టీమిండియా బోణీ

కివీస్ తో వన్డే సిరీస్ లో టీమిండియా బోణీ
x
Highlights

న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా సిరీస్ లోని తొలివన్డేలో టీమిండియా అలవోక విజయం సాధించింది. నేపియర్ మెక్లీన్ పార్క్ వేదికగా ముగిసిన తొలిసమరంలో విరాట్ సేన 8...

న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా సిరీస్ లోని తొలివన్డేలో టీమిండియా అలవోక విజయం సాధించింది. నేపియర్ మెక్లీన్ పార్క్ వేదికగా ముగిసిన తొలిసమరంలో విరాట్ సేన 8 వికెట్ల విజయంతో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఆతిథ్య న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, షమీ 3, చాహల్ 2 వికెట్లు, కేదార్ జాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. సమాధానంగా 158 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియాకు...ఓపెనర్లు రోహిత్- శిఖర్ ధావన్ మొదటి వికెట్ కు 41 పరుగులతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ ధావన్, కెప్టెన్ కొహ్లీ...రెండో వికెట్ కు కీలక భాగస్వామ్యంతో టీమిండియాకు విజయం ఖాయం చేశారు. ధావన్ 69 బాల్స్ లో 6 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. అంతకుముందు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ.. 100 వికెట్ల మైలురాయిని చేరాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా వికెట్ల సెంచరీ సాధించిన భారత ఫాస్ట్ బౌలర్ గా షమీ రికార్డుల్లో చేరాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories