చంద్రబాబుపై శివసేన వ్యంగాస్త్రాలు

చంద్రబాబుపై శివసేన వ్యంగాస్త్రాలు
x
Highlights

బీజేపీయేత ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై శివసేన వ్యంగాస్త్రాలు సంధించింది. ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు...

బీజేపీయేత ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై శివసేన వ్యంగాస్త్రాలు సంధించింది. ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాయంటూ ఆ పార్టీ వ్యాఖ్యానించింది. డూప్లికేట్ తాళం చెవితో అధికారం కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేసింది. తాను స్వయంగా పాలిస్తున్న ఏపీలోనే చంద్రబాబు ఓడిపోతారంటూ ఆ పార్టీ వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రచారంలో ఐదు ప్రాంతీయ పార్టీల నేతలు తామే ప్రధానమంత్రి అంటూ ప్రచారం చేసుకున్నాయని మే 23 తరువాతే వీటితో ఐక్యత తేలుతుందన్నారు. మోడీకే మెజార్టీ వస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నా చంద్రబాబు వ్యర్ధ ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఎన్నికల ఫలితాలకు ముందే విపక్షాలన్నీ ఒక తాటిపైకి తీసుకరావాలన్న ఉద్దేశంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి అప్ అన్ డౌన్ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలలో ఎన్డీఏకు అనుకూలంగా రావడంలో ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయి. ఫలితంగా నేడు జరగాల్సిన ఢిల్లీ పర్యటనను మాయావతి రద్దు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories