పుల్వామాలో మళ్లీ ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల మృతి

పుల్వామాలో మళ్లీ ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల మృతి
x
Highlights

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా అవంతిపోరాలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో 130 బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, 55...

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా అవంతిపోరాలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో 130 బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ సాయంతో గాలింపు చేపట్టారు. ఈక్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఎదురు కాల్పులు చోటు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలంలో ఎకె -56 తుపాకీని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భావిస్తున్న ఒక ఇంటినిపేల్చివేశారు. వీరిలో ఒకరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్‌ షౌకత్‌ అహ్మద్‌ దార్‌గా భావిస్తున్నారు. మరో ఉగ్రవాది కూడా ఉన్నారని భద్రత సిబ్బంది చెప్పారు. గురువారం నుంచి భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం పుల్వామాలో గాలింపు చేపట్టారు. గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఇక ఈ ఎదురుకాల్పులతో పుల్వామాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories