ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలపాలని ఒత్తిడి తెచ్చిందాయనే: పవన్

ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలపాలని ఒత్తిడి తెచ్చిందాయనే: పవన్
x
Highlights

2019సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికార పగ్గాలు చేపడితే ఏపీలో రౌడీయిజం విచ్చలవీడిగా పెరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. జగన్‌...

2019సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికార పగ్గాలు చేపడితే ఏపీలో రౌడీయిజం విచ్చలవీడిగా పెరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. జగన్‌ సంస్కృతిని కాకినాడకు తీసుకువస్తే తరిమి తరిమి కొడతామని పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో కానీ వైసీపీ పార్టీ ప్రజలు గెలిపిస్తే మాత్రం నెత్తిన భస్మం చల్లుకున్నట్లేనని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వస్తానని పగటికలలు కంటున్నరని ఆ కలలను ప్రజలను తిప్పికొడతారని అన్నారు. వైఎస్ కుటుంబం మహిళలకు చేసిన అన్యాయం తెలుసన్నారు. అందుకే ప్రజలు సామాన్యుడికి అండగా నిలిచే జనసేనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అయితే కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు కాకినాడ రూరల్‌ వైసీపీ అభ్యర్థి కన్నబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలపాలని ఒత్తిడి చేసింది కన్నబాబేనన్నారు పవన్ కళ్యాణ్.

Show Full Article
Print Article
Next Story
More Stories