దేశమంతా మోడీ ట్రెండ్ :అమిత్ షా

దేశమంతా మోడీ ట్రెండ్ :అమిత్ షా
x
Highlights

దేశమంతా మోడీ ట్రెండ్ నడుస్తోందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా . మళ్లీ మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు. దేశం నుంచి ఉగ్రవాదం పారిపోవాలంటే మోడీ...

దేశమంతా మోడీ ట్రెండ్ నడుస్తోందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా . మళ్లీ మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు. దేశం నుంచి ఉగ్రవాదం పారిపోవాలంటే మోడీ రావాలంటూ పిలుపునిచ్చారు. నిజామాబాద్ వేదికగాఎన్నికల ప్రచార శంఖారావాన్ని ప్రారంభించారు అమిత్ షా.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని నిజామాబాద్ నుంచి ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరచాలని అమిత్‌షా కోరారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాద శక్తులను వెతికి పట్టుకుని తరిమేస్తామని అన్నారు. వైమానిక దాడులపై ప్రతిపక్షాలు ఆధారాలు కావాలంటున్నాయని మండిపడ్డారు.

టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తెలంగాణలో గేమ్ ఆడుతున్నాయన్నారు అమిత్ షా. వారి లాలూచీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఐదేళ్లలో 2లక్షల కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. నిజామాబాద్ సమావేశంతో బిజెపిలో కొత్త ఉత్సాహం వచ్చింది. అమిత్‌షా కార్యకర్తల్లో జోష్ నింపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories