చంద్రబాబుకు జేసీ దివాకర్‌ ఝలక్‌

చంద్రబాబుకు జేసీ దివాకర్‌ ఝలక్‌
x
Highlights

ఏపీలో ఎన్నికల పొలింగ్‌కు మరికొద్ది గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రచారంలో దూసుకెళ్తున్న వేళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి టీడీపీ ఎంపీ...

ఏపీలో ఎన్నికల పొలింగ్‌కు మరికొద్ది గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రచారంలో దూసుకెళ్తున్న వేళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఝలక్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని జేసీ దివాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపురంలో జేసీ మాట్లాడుతూ ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన తనకు ఆ పార్టీపై మమకారం ఇంకా చావలేదన్నారు జేసీ దివాకర్ రెడ్డి. అందుకే తాను ఇలా మాట్లాడుతున్నానని జేసీ దివాకర్ మనసులోని మాటను చెప్పారు. కేవలం తనకు హింది రాకపోవడం వల్లనే ఎంపీగా ఫెయిల్ అయ్యానని జేసీ దివాకర్ రెడ్డి ఒప్పుకున్నారు. తన కుటుంబం గద్వాల్‌ నుంచి వలస వచ్చిన మాట నిజమేనని, తన స్థానికతను ప్రశ్నించొద్దని జేసీ దివాకర్ రెడ్డి ప్రజలను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories