నేడు వారణాసికి మోదీ.. 5 కిలోమీటర్లు విజయోత్సవ ర్యాలీ..

నేడు వారణాసికి మోదీ.. 5 కిలోమీటర్లు విజయోత్సవ ర్యాలీ..
x
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వారణాసిలో పర్యటిస్తారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా సుమారు 5 కిలోమీటర్ల...

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వారణాసిలో పర్యటిస్తారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా సుమారు 5 కిలోమీటర్ల మేర విజయోత్సవ ర్యాలీని చేపడతారు. దీంతో వారణాసి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ పర్యటనలో మోడీ కాశీ విశ్వనాథుడిని కూడా దర్శించుకుంటారు. మరోవైపు మోడీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ పర్యవేక్షించారు. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 30న రాత్రి 7 గంటలకు మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రధాన పూజారి ఆచార్య అశోక్ ద్వివేదీ, నేడు మోదీ తరపున పూజ చెయ్యబోతున్నారు. 2014లో కూడా విజయం తర్వాత మోడీ ఇక్కడ పూజలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories