మోడీ సర్కార్ సంచలన నిర్ణయం

మోడీ సర్కార్ సంచలన నిర్ణయం
x
Highlights

మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిజర్వేషన్ వర్తింపు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా ప్రధాని మోడీ కొత్త అస్త్రాన్ని సంధించారు. లోక్‌సభ ఎన్నికల్లో అగ్రవర్ణ పేదలను తమ వైపు తిప్పుకునేందుకు మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్ధికంగా వెనకబడిన అగ్రవర్ణాల ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మోడీ క్యాబినెట్ నిర్ణయించింది. ఐదెకరాల కంటే తక్కువ పొలం ఉన్నఅగ్రవర్ణాలకే రిజర్వేషన్లకు అర్హులని కేంద్రం నిర్ణయించింది. అదే విధంగా 1000 చదరపు అడుగుల ఇంటిస్థలం ఉంటే రిజర్వేషన్లకు అనర్హులని కేంద్రం స్పష్టం చేసింది.

ఈబీసీలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వాగతించారు. అగ్రవర్ణాల్లో పేదలకు ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని రాందాస్ అన్నారు. మోడీ ప్రభుత్వం సబ్ కా సాథ్ సబ్‌ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళుతోందని అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు.

అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఆర్ధిక అసమానతల కారణంగా రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని అన్నారు. సామాజిక వివక్షత, సాంఘిక అసమానతలను రూపు మాపడమే రిజర్వేషన్ల లక్ష్యమని ఒవైసీ వివరించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిద్ర పోతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీస్ సింగ్ సుర్జేవాలా మండిపడ్డారు. నాలుగన్నరేళ్లుగా పేదలకు ఏమీ చేయని మోడీ సర్కార్ ఎన్నికల ముందు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే కొందరు నాయకులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories