గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి

గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి
x
Highlights

చాలామంది చాలా రకాలుగా చనిపోతుంటారు. కొంతమంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతే, మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు. మరికొంతమంది అనారోగ్యంతో...

చాలామంది చాలా రకాలుగా చనిపోతుంటారు. కొంతమంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతే, మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు. మరికొంతమంది అనారోగ్యంతో చనిపోతుంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం గొంతులో కోడి గుడ్డు ఇరుక్కుని చనిపోయాడు. ఏంటి గుడ్డు ఇరుక్కుని చనిపోయాడా..! అనుకుంటున్నారా కాని అది ముమ్మాటికి నిజం. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో ఈ విషాదసంఘటన చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం యాచారం మండలం గున్‌గల్గ్రామంలో యాదయ్య (45) నివసిస్తున్నాడు. ఇతను ఇబ్రహీంపట్నంలోని శ్రీరామ వైన్స్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. రోజూ లాగానే గురువారం రాత్రి తన విధులను ముగించుకున్న యాదయ్య వైన్స్‌లోని పర్మిట్ రూమ్‌లో మద్యం సేవిస్తూ కోడి గుడ్డును తిన్నాడని తెలిపారు. మద్యం మత్తులో యాదయ్య గుడ్డును తింటుండగా అది ఒక్క సారిగా గొంతులో ఇరుక్కు పోయిందని దాంతో వెంటనే అతడు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడని తెలిపారు. అది గమనించిన స్థానికులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. గుడ్డు గొంతులో ఇరుక్కు పోవడంతో యాదయ్యకు ఊపిరి ఆడక ఆస్పత్రికి తరలించే మార్గంలోనే చనిపోయాడని వైద్యుల తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories