రేపు వైసీపీలో చేరనున్న టీడీపీ కీలకనేత.. ఎంపీ టికెట్ ఫిక్స్!

రేపు వైసీపీలో చేరనున్న టీడీపీ కీలకనేత.. ఎంపీ టికెట్ ఫిక్స్!
x
Highlights

ఏపీలో ఎన్నికల కోలహలం మొదలైంది. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలలో జోరుగా చేరికలతో హడవుడి ఇంత అంత కాదు. ఎప్పుడు ఏ పార్టీ నుండి ఏ పార్టీకి గుడ్ బై చెప్పి...

ఏపీలో ఎన్నికల కోలహలం మొదలైంది. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలలో జోరుగా చేరికలతో హడవుడి ఇంత అంత కాదు. ఎప్పుడు ఏ పార్టీ నుండి ఏ పార్టీకి గుడ్ బై చెప్పి మరోక పార్టీ తీర్థంపుచ్చుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. కాగా ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఆయన వైసీపీ గూటికి చేరితే ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీచేసి గెలిచిన జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, వైసీపీ మాజీ ఎంపీని రాజ్యసభకు లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. కాగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో ఉన్న విభేదాలే వైవీ సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలని జోరుగా పుకార్లు గుప్పుమంటున్నాయి. వైసీపీలోకి వచ్చే వాళ్లు ఇంకా ఎవరెవరున్నారు..? ఇలా అన్నీ లెక్కలు చూసుకుని మరో రెండ్రోజుల పాటు హైదరాబాద్ లో‌టస్‌పాండ్‌లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల లిస్ట్ ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories