జనసేనకు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన మహిళా నేత

జనసేనకు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన మహిళా నేత
x
Highlights

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా జనసేనకు వరుసపెట్టి...

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. ఏ పార్టీలో తమకు సీటు వస్తుందో ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా జనసేనకు వరుసపెట్టి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు గుడ్ బై చెప్పి వైసీపీ, టీడీపీ తీర్థంపుచ్చుకున్న విషయం తెలిసిందే కాగా తాజాగా తాజాగా మరో మహిళా నేత జనసేనకు గుడ్ బై చెప్పేశారు. ఆదివారం మంత్రి నారా లోకేష్ సమక్షంలో జనసేన నాయకురాలు తమ్మిశెట్టి జానకీదేవి టీడీపీ గూటికి చేరారు. 2009లో పీఆర్పీ తరపున మంగళగిరి నుంచి తమ్మిశెట్టి పోటీ చేశారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె కొద్దిరోజుల క్రితం జనసేనతో రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. జనసేన తీసుకున్న నిర్ణయాలతో తమ్మిశెట్టి జానకీదేవి అసంతృప్తికి లోనై టీడీపీలో చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories