ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గనపడుటుండంతో పార్టీ అధినేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ గురువారం తిరుపతిలో ప్రచార సభలో...
ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గనపడుటుండంతో పార్టీ అధినేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ గురువారం తిరుపతిలో ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ అల్లుడి అరాచకాలు తిరుపతిలో మితీమిరి పోతున్నాయని మళ్లీ గనక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కబ్జాలు ఎక్కువైపోతాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. తిరుపతిలో జనసేన కార్యకర్త వినోద్ రాయల్ను దారుణంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్లు తెలుగు ప్రజలకు చేసిన మోసం ఏనాడూ మర్చిపోరని పవన్ అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఏపీ ప్రత్యేక హోదా కోసం మద్ధతు ఇచ్చారని ఈ సందర్భంగా పవన్ అన్నారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని, తిరుపతిలోని 52 మురికివాడల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire