జగన్ పులివెందుల పయనం .. అసలు కారణం ఇదే..

జగన్ పులివెందుల పయనం .. అసలు కారణం ఇదే..
x
Highlights

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కడప జిల్లాకు వెళ్లనున్నారు. జిల్లాలో మూడు మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు సాయంత్రానికి...

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కడప జిల్లాకు వెళ్లనున్నారు. జిల్లాలో మూడు మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు సాయంత్రానికి పులివెందుల చేరుకుని బుధ, గురువారాల్లో స్థానిక వైసీపీ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. అనంతరం గురువారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి రానున్నారు. అయితే ఏపీ ఎన్నికల ఫలితాల ముందు జగన్ మోహన్ రెడ్డి పర్యటన వెనక అసలు కారణం వేరే ఉందని వార్తలు కోడైకూస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఏ రకంగా ఉందనే అంశంపై పులివెందుల పర్యటనలో జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది.

ముందుగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించడం ద్వారా ఎన్నికల్లో వైసీపీ విజయావకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై వాస్తవాలు తెలుస్తాయని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. కాగా రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై వైసీపీ గంపెడు ఆశలు పెట్టుకుంది. జగన్ పులివెందుల పర్యటన తరువాత ఆ ఆరు జిల్లాల్లో పార్టీ విజయావకాశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories