వరుడు పరారీ.. తాళి కట్టిన మరో యువకుడు

వరుడు పరారీ.. తాళి కట్టిన మరో యువకుడు
x
Highlights

మరికొద్ది గంటల్లోనే పెళ్లి. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో ప్రేమించిన యువతితో వరుడు పరారు కాడంతో పెళ్లి ఆగింది. అదే సమయంలో వధువును పెళ్లి చేసుకునేందుకు మరో యువకుడు ముందుకు వచ్చాడు అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచాడు.

మరికొద్ది గంటల్లోనే పెళ్లి. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో ప్రేమించిన యువతితో వరుడు పరారు కాడంతో పెళ్లి ఆగింది. అదే సమయంలో వధువును పెళ్లి చేసుకునేందుకు మరో యువకుడు ముందుకు వచ్చాడు అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. ఇది ఏమైనా సినిమా స్టోరీ అనుకుంటున్నారా కాదు సిద్దిపేట జిల్లా హుస్నాబా లో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. హుస్నాబాద్ మండలం పొట్లపల్లికి చెందిన యువతికి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరుకు చెందిన శ్రీనివాస్ తో వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 29 ఉదయం 11 గంటలకు పెళ్లి జరుగాల్సి ఉంది. ఇందుకు వధువు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వరుడిని తీసుకువచ్చేందుకు అతని ఇంటికి వెళ్లారు.

మరొకరిని పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిన ప్రియురాలు శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించారు. ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరిని వదలిపెట్టారు. పెళ్లి ఆగిపోవడంతో వధువు తల్లిదండ్రులు అంతకుముందు సంబంధం చూసిన రమేశ్ అనే యువకుడిని సంప్రదించి జరిగిన విషయాన్ని చెప్పారు. దీనితో రమేశ్ ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. పెద్దల సమక్షంలో ఇరువురికి వివాహం పెద్ద మనసుతో ముందుకు వచ్చి యువతిని పెళ్లి చేసుకున్న రమేశ్‌ను అందరూ అభినందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories