67 మంది విద్యార్థినులకు అస్వస్థత

67 మంది విద్యార్థినులకు అస్వస్థత
x
Highlights

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలంలోని కస్తూర్భా వసతి గృహంలో 67 మంది విద్యార్ధినులు అస్వస్ధతకు గురయ్యారు.

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలంలోని కస్తూర్భా వసతి గృహంలో 67 మంది విద్యార్ధినులు అస్వస్ధతకు గురయ్యారు. రాత్రి భోజనం తీసుకున్న కొద్దిసేపటికి వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆహారం కలుషితం కావడం వల్లే అస్వస్ధతకు గురైనట్టు వైద్యులు గుర్తించారు. అయితే రాత్రి తాము ఫుడ్ సలాడ్ మాత్రమే ఇచ్చినట్టు హాస్టల్ సిబ్బంది చెబుతుండగా ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డలు అనారోగ్యం పాలయ్యారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కాగా 20 మంది విద్యార్థినులకు తీవ్రమైన విరేచానాలతో మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇక మిగత విద్యార్థినులు స్థానిక ఆసుపత్రిలో చిక్పిత్స పొందుతున్నారు. అసలు ఈ ఘటనకు ఫుట్ పాయిజనే కారణమని ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories