విశాఖ లో నేడు చంద్రబాబు, జగన్ ఎన్నికల ప్రచారం

విశాఖ లో నేడు చంద్రబాబు, జగన్ ఎన్నికల ప్రచారం
x
Highlights

ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచిన టీడీపీ అధినేత, వైసీపీ అధినేత ఇద్దరూ నేడు విశాఖలో పర్యటించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, వైసీపీలు ఈరోజు...

ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచిన టీడీపీ అధినేత, వైసీపీ అధినేత ఇద్దరూ నేడు విశాఖలో పర్యటించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, వైసీపీలు ఈరోజు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. ఒకేరోజు ఇరు పార్టీల అధినేతలు సభలలో పాల్గొననున్నారు.ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు మూడు జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. విశాఖపట్నంలో జరిగే ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశంకానున్నారు. బూత్‌ కమిటీ, నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత జగన్ పి గన్నవరంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. జిల్లాలో ప్రధాన పార్టీల అధినేతలు సభలు నిర్వహిస్తుండటంతో ఆయా పార్టీల కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories