ఆ పార్టీలను చిత్తుగా ఓడించాలి: చంద్రబాబు

ఆ పార్టీలను చిత్తుగా ఓడించాలి: చంద్రబాబు
x
Highlights

భారత ప్రధాని నరేంద్రమోడీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోడీ ఎప్పుడు...

భారత ప్రధాని నరేంద్రమోడీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోడీ ఎప్పుడు అడుగుపెట్టిన అది చీకటి రోజన్నారు చంద్రబాబు. తమ హక్కులను కాలరాసి ఈ గడ్డమీద కాలు పెడితే మాత్రం తాము ఉపేక్షించమని చంద్రబాబు హెచ్చరించారు. వచ్చే ఎన్నికల రణరంగంలో టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రసర్కార్ మనల్ని నమ్మించి మోసం చేసి మనల్ని నట్టేట ముంచిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. మోడీ ఏపీకి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. బీజేపీతో పాటు వారికి సహకరించిన పార్టీలను చిత్తుగా చిత్తుగా ఓడించాలని చంద్రబాబు అన్నారు. ఏపీలో వైసీపీ ఫ్యాన్ ఉంటే, హైదరాబాద్‌లో స్విచ్, ఢిల్లీలో ఫ్యూజ్ ఉందని అన్నారు. మోసపూరితమైన రైల్వే జోన్ మాకు వద్దని మాకు విశాఖ జోన్ కావాలి అని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories