టీడీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు

టీడీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
x
Highlights

ప్రకాశం జిల్లా కొండపి రైతు సదస్సులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సదస్సుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే స్వామిని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. సదస్సు...

ప్రకాశం జిల్లా కొండపి రైతు సదస్సులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సదస్సుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే స్వామిని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. సదస్సు నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అనుచరులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే, ప్రొటోకాల్ ప్రకారమే సదస్సుకు వచ్చానని పేర్కొంటూ గేటు దగ్గరే బైఠాయించారు. మరోవైపు ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వైసీపీ,టీడీపీ వర్గాలను నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఈ విషయమై ఎమ్మెల్యే స్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరుఅవుతున్నట్లు తాను ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చానని అయినా తనకు పోలీసులు రక్షణ కల్పించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories