ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఏపీ అభివృద్ధి: కృష్ణయ్య

ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఏపీ అభివృద్ధి: కృష్ణయ్య
x
Highlights

ఏపీ అభివృద్ధి చెందాలంటే వచ్చే నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు...

ఏపీ అభివృద్ధి చెందాలంటే వచ్చే నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఆర్‌.కృష్ణయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో బిల్లు పెట్టకుండా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను మోసం చేశారని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టి ఐదుగురు ఎంపీలతో పోరాడిన వ్యక్తి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు ఏవైతే రిజర్వేషన్‌ బిల్లులు ఉన్నాయో, బీసీలకు కూడా ఆ ప్రకారమే ఏర్పాటు చేయాలని ఆర్‌.కృష్ణయ్య కోరారు. డా. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన శాసనసభ్యులతో బీసీలకు ప్రైవేటు బిల్లు పెట్టేవిధంగా తీర్మానం చేశాడని ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories