ఇంట్లో పని మనిషిని, దేశ సేవకుడిని తెలివిగా నిర్ణయించాలి : మోదీ

ఇంట్లో పని మనిషిని, దేశ సేవకుడిని తెలివిగా నిర్ణయించాలి : మోదీ
x
Highlights

నిజాయితీగా సేవలందించేవారిని ఎంపిక చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు.

నిజాయితీగా సేవలందించేవారిని ఎంపిక చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. ఇంట్లో సహాయక సిబ్బందిని ఏ విధంగా నిర్ణయించుకుంటారో, అదే విధంగా జాతీయ సేవకుడు ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకోవాలని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పథకాలకు తన పేరును జత చేయలేదని మోడీ గుర్తు చేశారు. తమకు ఎవరు సేవ చేస్తారో గుర్తించి నాయకుడిగా ఎన్నుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అవినీతి ఊబిలో చిక్కుకున్నారని మోదీ గుర్తు చేశారు. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్య కుటుంబానికి చాలా సమన్లు పంపించినప్పటికీ వారు వాటికి అనుగుణంగా ప్రవర్తించడం లేదని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories