ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్‌.. అమృత స్పందన ఇదే..

ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్‌.. అమృత స్పందన ఇదే..
x
Highlights

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు...

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురయ్యాడు. A1గా ఉన్న అమృత తండ్రి తిరునగరు మారుతీ రావు, A4గా ఉన్న అబ్దుల్ కరీం, A4గా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌ వరంగల్ ‌జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. నిందితులకు బెయిల్ మంజూరు చేయడంపై ప్రణయ్ కుటుంబ సభ్యులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం పోరాడుతామని చెప్పారు.

బెయిల్ మంజూరు పై స్పందించిన అమృత భారత దేశ న్యాయవ్యవస్థ తీరు సరిగా లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేసిన వారిపై పీడీ యాక్ట్‌ కొట్టివేసి బెయిల్‌పై విడుదల చేయడం దారుణమని అన్నారు. కాగా నిందితులు బయటకు రావడం వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని. దీనిపై హైకోర్టుకు అప్పీలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.





Show Full Article
Print Article
Next Story
More Stories