జగన్‌.. మిమ్మల్ని ఎలా నమ్మాలి?: శివాజీ

జగన్‌.. మిమ్మల్ని ఎలా నమ్మాలి?: శివాజీ
x
Highlights

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సినీ నటుడు శివాజీ మరోసారి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకొనే రీతిలో...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సినీ నటుడు శివాజీ మరోసారి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకొనే రీతిలో వ్యవహరిస్తున్నారని శివాజీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కొంచెం కూడా సహించని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావుతో సాయంతో ఏపీ ప్రత్యేక హోదా సాధిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమవారం శివాజీ తూ.గో జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మురళీమోహన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాగా ఏపీ ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న వైఎస్ జగన్ మోహన్ పై భవిష్యత్తులో కేసులు నిరూపణ అయితే పరిస్థితి ఏంటని శివాజీ ప్రశ్నించారు. ఇక అమరావతిపై జగన్‌ మోహన్ రెడ్డి తన వైఖరిని ఎందుకు స్పష్టంచేయడం లేదని శివాజీ నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సోనియా గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి జగన్‌ హోదా సాధిస్తానంటే ఎలా నమ్మాలని శివాజీ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories