బంపర్ ఆఫర్ ప్రకటించిన గో ఎయిర్ .. విమాన చార్జ్ లు @ ..

Highlights

దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ గో ఎయిర్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన మార్గాలకు అతి తక్కువకు రూ.312కే టిక్కెట్లను...

దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ గో ఎయిర్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన మార్గాలకు అతి తక్కువకు రూ.312కే టిక్కెట్లను విక్రయిస్తోంది. ఢిల్లీ, కొచ్చి, బెంగళూరులను కలుపుకుని ఏడు నగరాలకు వన్‌-వే జర్నీకి ఈ టిక్కెట్‌ ధరలను ఆఫర్‌ చేస్తుంది. శుక్రవారం నుంచి బుక్‌ చేసుకునే టిక్కెట్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఫస్ట్‌-కమ్‌-ఫస్ట్‌ సర్వ్‌డ్‌ బేసిస్‌లో, పరిమిత కాల వ్యవధిలో ఈ ఆఫర్‌ అందించనున్నట్టు గోఎయిర్‌ విమానయాన సంస్థ ప్రకటించింది.

ఈ డిస్కౌంట్‌ ధరల్లో పన్నులను కలుపలేదు. డిసెంబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్‌ 28 వరకు ప్రయాణాలకు ఇది వాలిడ్‌లో ఉండనుంది. నేటి నుంచి నవంబర్‌ 29 వరకు ఈ ఆఫర్‌పై టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. న్యూఢిల్లీ, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌, లక్నో మార్గాలకు ఈ ప్రత్యేక ధరలు అందుబాటులో ఉండనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories