సరిగ్గా లేకపోతే బండకేసి కొడతారు: టీఆర్ఎస్‌కు భట్టి హెచ్చరిక

సరిగ్గా లేకపోతే బండకేసి కొడతారు: టీఆర్ఎస్‌కు భట్టి హెచ్చరిక
x
Highlights

తాజాగా తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పీఠం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎవరిని ఎవరు కక్కిస్తారో కాలం చెబుతుందంటూ సీఎం...

తాజాగా తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పీఠం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎవరిని ఎవరు కక్కిస్తారో కాలం చెబుతుందంటూ సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క. మనుషులను బేదిరించి మరి తమ పనులను చేయాలనుకుంటున్నారా అని సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అనే వారు చట్టబద్దంగానే పనిచేయ్యాలని కెసిఆర్‌కు భట్టి హితవు పలికారు. తాజాగా కాంగ్రెస్ నేతల అవినీతిని కక్కిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన భట్టి అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం శాశ్వతం అనుకుంటే అదివారి అమాయకత్వమేనని అన్నారు. సరిగ్గా లేకపోతే బండకేసి కొడతారన్న వాస్తవాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories