ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌

Highlights

జియో ఎఫెక్ట్‌‌తో ఎయిర్‌‌టెల్ కొత్తగా తమ కంపెనీ ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే వినియోగదారులకు బంపర్ ఆఫరిచ్చింది. జియో ఇటీవలే కొత్త ప్లాన్స్‌ను ప్రకటించిన...

జియో ఎఫెక్ట్‌‌తో ఎయిర్‌‌టెల్ కొత్తగా తమ కంపెనీ ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే వినియోగదారులకు బంపర్ ఆఫరిచ్చింది. జియో ఇటీవలే కొత్త ప్లాన్స్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్‌‌టెల్ వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ. 293తో కొత్తగా సిమ్ తీసుకునే వారికి 84 జిబీ 4జీ డేటా 84 రోజుల వరకూ అందజేయనున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రీ పెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్‌‌లో ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్‌కు అన్‌లిమిటెడ్ కాల్స్‌ మాట్లాడుకోవచ్చని సంస్థ తెలిపింది. ఎయిర్‌టెల్ తాజాగా ప్రకటించిన ప్లాన్స్‌కు సంబంధించిన వివరాలివే..
మొదటి ఆఫర్.. ప్లాన్: రూ. 293, కాల్స్: ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్‌కు మాత్రమే, డేటా: డెయిలీ 1జీబీ డేటా (84 జీబీ), కాల పరిమితి: 84 రోజులు మాత్రమే.
రెండో ఆఫర్‌: ప్లాన్: రూ. 449, కాల్స్: అన్‌లిమిటెడ్, డేటా: 4జీ డేటా డెయిలీ 1జీబీ (84 జీబీ), కాల పరిమితి: 84 రోజులు మాత్రమే.
ఈ ఆఫర్లు ఇదివరకు ఎయిర్‌‌టెల్‌‌నెట్ వర్క్‌లో ఉన్న కస్టమర్లకు వర్తించవు.. కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తించనున్నాయ్..

Show Full Article
Print Article
Next Story
More Stories