ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్..

ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్..
x
ఆర్ బీ ఐ
Highlights

రిజర్వు బ్యాంక్ ఖాతాదారులకు ఒక కమ్మటి వార్తను అందించింది. ఇప్పటి వరరూ కేవలం 12 గంటలు మాత్రమే పనిచేసిన నెఫ్ట్ లావాదేవీ సేవల సమయాన్ని పొడిగించింది.

రిజర్వు బ్యాంక్ ఖాతాదారులకు ఒక కమ్మటి వార్తను అందించింది. ఇప్పటి వరరూ కేవలం 12 గంటలు మాత్రమే పనిచేసిన నెఫ్ట్ లావాదేవీ సేవల సమయాన్ని పొడిగించింది. 24 గంటల పాటు ఏ సమయంలో నైనా ఈ సేవల ద్వారా లావాదేవీలను చేసుకోవచ్చని రిజర్వు బ్యాంక్ తెలిపింది.

ఈ నెల అంటే డిసెంబర్ 16వ తేది 00:30 తర్వాత రిజర్వు బ్యాంక్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకూ ఈ సేవలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉండేది. కానీ ఈ కొత్త ప్రణాళిక ద్వారా ఇప్పుడు 24 గంటల పాటు ఈ సర్వీసు వినియోగంలో ఉంది.

దీంతో ఖాతాదారుల లావాదేవీ వీలైనంత త్వరగా సెటిల్ అవుతాయని రిజర్వు బ్యాంక్ వెల్లడి చేసింది. ఒకవేళ ఈ ట్రాన్ జక్షన్ ద్వారా ఖాతాలో డబ్బులు జమ కాకపోయినట్లయితే 2 గంటల్లోగా రిటర్న్ అవుతాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. పేమెంట్స్ సెటిల్‌ మెంట్ విజన్ 2019-21లో భాగంగా ఆర్బీఐ మొదటిసారిగా నెఫ్ట్, ఆర్టీజిస్ సేవలను ఉచితంగా 24 గంటలపాటు కస్టమర్లు వినియోగించుకునేందుకు ఆర్బీఐ ఈ సేవలను వినియోగదారుల ముందుకు తీసుకువస్తుంది.

అంతే కాకుండా సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్- NEFT లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకులకి ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు 2020 జనవరి నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories