ఆర్టికల్ 370 రద్దు: వైసీపీ, టీడీపీ మద్దతు

ఆర్టికల్ 370 రద్దు: వైసీపీ, టీడీపీ మద్దతు
x
Highlights

జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం...

జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, అమిత్‌షాకు హ్యాట్సాఫ్ చెబుతున్నట్లు రాజ్యసభలో విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడ్డాయని అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి తమ పార్టీ మద్దతు, జగన్మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర పునర్విభజనకు సంబంధించిన బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. గత 60 సంవత్సరాలుగా జమ్మూకశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చిక్కులు దూరమవుతాయని చెప్పారు. తాజా నిర్ణయం కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు పొందుతున్న అవకాశాలను జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా పొందుతారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories