ఏపీ భవన్లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఉభయ సభలకు చెందిన వైసీపీ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో...
ఏపీ భవన్లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఉభయ సభలకు చెందిన వైసీపీ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ చర్చించనున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉభయ సభల్లోనూ అవలంబించాల్సిన విధానంపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొనున్నారు. ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 115 ఏస్పిరేషనల్ జిల్లాలపై చర్చ జరగనుంది. 115 ఏస్పిరేషనల్ జిల్లాల జాబితాలో ఏపీలోని వైఎస్సార్ కడప, విజయనగరం, విశాఖ, తెలంగాణలో అసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. నీతి ఆయోగ్ సమావేశంలో తనకు కేటాయించిన సమయం ప్రకారం వైఎస్ జగన్ 7 నిమిషాలు మాట్లాడనున్నారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire