మీ ధైర్యానికి జోహార్లు బాబూ..

మీ ధైర్యానికి జోహార్లు బాబూ..
x
Highlights

విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను 'ఓటర్ల ప్రలోభాలకు' మళ్లించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల...

విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను 'ఓటర్ల ప్రలోభాలకు' మళ్లించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి 30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబూ. అంటూ వైసీపీ నాయకుడు,రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. విత్తనాల సమస్యపై చంద్రబాబు స్పందిస్తున్న తీరుకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను గాలికొదిలి తన సౌకర్యాల గురించి పోరాడుతున్నారు చంద్రబాబు. ప్రభుత్వానికి రాసిన మొదటి లేఖలో ప్రజావేదికను కేటాయించాలని కోరారు. తనకు భద్రత పెంచాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. వేతనం తీసకుంటున్నందుకైనా ప్రజలను కాస్త గుర్తు పెట్టుకోండి బాబూ. అంటూ చురకలంటిస్తూ మరో ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి





Show Full Article
Print Article
More On
Next Story
More Stories