కొండవీటి వాగుతో అమరావతికి ముప్పు: విజయసాయి రెడ్డి

కొండవీటి వాగుతో అమరావతికి ముప్పు: విజయసాయి రెడ్డి
x
Highlights

తాము తీసుకునే నిర్ణయాలు కేంద్రానికి తెలియజేస్తున్నామని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అమరావతి, పోలవరం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కేంద్రానికి వివరిస్తూనే ఉన్నామన్నారు.

తాము తీసుకునే నిర్ణయాలు కేంద్రానికి తెలియజేస్తున్నామని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అమరావతి, పోలవరం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కేంద్రానికి వివరిస్తూనే ఉన్నామన్నారు. పలు విషయాల్లో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని చెబుతున్నారు విజయసాయి. ఏపీ సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సంప్రదించే తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌, పీపీఏ అంశాల్లోనూ ప్రధాని మోదీతో మాట్లాడాకే సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు.

రాజధానిపై ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మీడియాకు చెబుతుంది కదా అని విజయసాయి వ్యాఖ్యానించారు. ఇంతవరకు తీసుకోని నిర్ణయంపై చర్చ అనవసరమన్నారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినపుడు కొండవీటి వాగు వల్ల రాజధాని అమరావతి ముంపునకు గురయ్యే ప్రమాదముందని చెప్పారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందన్నారు విజయసాయి. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను దోచుకుందని.. బాధ్యులైన వారందర్నీ చట్టపరిధిలోకి తీసుకురావాలనేదే తమ దృఢ సంకల్పమన్నారు. రాజధాని, పోలవరం రీటెండరింగ్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని.. దానిని నమ్మవద్దని విజయసాయి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories